శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కుల్గామ్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో అనంతనాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలోని హంగల్గుండ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు.. భద్రతా బలగాలు ఆయా ప్రాంతాలకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలోనే ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారు జామున అనంత్నాగ్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బిజ్బిహారాలోని బాద్షాహీ బాగ్ సమీపంలో భద్రతా బలగాలు పెట్రోలింగ్లో ఉండగా.. దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ దాడితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.