శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. శుక్రవారం ఉదయం షోపియాన్లోని కప్రేన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్ (JeM) ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది చనిపోయాడని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు.
J&K | Encounter has started at Kapren area of Shopian. Police and Army are on the job. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) November 11, 2022