శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. బారాముల్లా జిల్లాలోని క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడని వెల్లడించారు. ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
గత శనివారం కుప్వారా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు. వారిని లష్కరే తొయిబాకు చెందిన హైబ్రిడ్ టెర్రరిస్టులు అని పోలీసులు వెల్లడించారు.