Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతమైనట్లు సమాచారం. గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఇందులో ముగ్గురు హతమయ్యారు. మృతుల్లో పెర్మిలి దళ కమాండ్ బిట్లు మాధవి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.