జోధ్పూర్: మొఘల్ చక్రవర్తి అక్బర్ నిరంకుశ, క్రూర పాలకుడు, మహిళలపై అత్యాచారాలు చేసేవాడు అని రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ అన్నారు. ఆయన గొప్పవాడు కాదన్నారు. బజార్ల నుంచి యువతులను తీసుకెళ్లి, వారిపై లైంగికదాడులు చేసేవాడని చెప్పారు. పాఠశాల విద్యార్థుల పాఠ్యాంశాల్లో మార్పుల గురించి ఆదివారం విలేకర్లు ప్రశ్నించినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల చేత సూర్య నమస్కారాలు చేయించడం గురించి ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, దీనిని క్రమంగా అమలు చేస్తామని తెలిపారు.