Emergency Landing | బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వెళ్తున్న విమానం శుక్రవారం మధ్యాహ్నం పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంటర్నేషనల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో గ్రౌండ్ స్టాఫ్ అంతా షాక్తిన్నారు. ఎందుకంటే ఇక్కడకు అంతర్జాతీయ విమానాలు రాకపోడమే కారణం. సమాచారం మేరకు.. ఈ విమానం బంగ్లా రాజధాని ఢాకా నుంచి నేపాల్లోని ఖాట్మండుకు బయలుదేరింది. కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో దగ్గరలో ఉన్న పాట్నా విమానాశ్రయాన్ని పైలట్లు సంప్రదించారు.
అత్యవసర ల్యాండింగ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇచ్చింది. దాంతో పైలట్లు సురక్షితంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. సకాలంలో లోపాన్ని గుర్తించి దించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా.. విమానం నుంచి ప్రయాణికులను కిందకు దించలేదు. వారికి అందులోనే ఉంచి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాంకేతిక లోపాన్ని గుర్తించి.. సమస్యను పరిష్కరించిన తర్వాత విమానం ఖాట్మండుకు బయలుదేరుతుందని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
టెక్నికల్ టీమ్ విమానంలో లోపాన్ని సరి చేస్తున్నది. BBC371 విమానంలో 77 మంది ప్రయాణికులు ఉండగా.. పాట్నా విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.01 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సవరించేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తుందని, విమానం సమస్య పరిష్కారం కాకపోతే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులను ఖాట్మండుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.