న్యూఢిల్లీ : మే 2న మీ మొబైల్ ఫోన్కు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అలర్ట్ మెసేజ్ రావొచ్చు. దాన్ని చూసి కంగారు పడకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి, ఇతర విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం సాచెట్ అనే కొత్త వ్యవస్థను తయారు చేసింది.
ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు టెలికం శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. పెద్ద శబ్దంతో మెసేజ్ వస్తే మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. దానికి స్పందించడం, సమాధానం ఇవ్వాల్సిన అవసరమూ లేదు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారం వేగంగా ప్రజలకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఒక అధికారి తెలిపారు. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది.