న్యూఢిల్లీ: ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్కు వినియోగదారులు షాక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో పదవి నుంచి మస్క్ వైదొలగాలని తాజా పోల్లో అత్యధిక మంది స్పష్టం చేశారు. ‘ట్విట్టర్ అధిపతిగా నేను వైదొలగాలా? మీ నిర్ణయం ఏదైనా దానికి నేను కట్టుబడి ఉంటా’ అని ప్రతిపాదిస్తూ ఆదివారం ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు. దీంతో ఏకంగా 57.5 శాతం (98.6 లక్షల) మంది మస్క్ వైదొలగాలని ఝలక్ ఇచ్చారు. అయితే, మెజారిటీ వాటా ఉన్న మస్క్ను తొలగించే అధికారం ఎవరికీ లేదు.