న్యూఢిల్లీ, మే 12: ట్విట్టర్కు కొత్త సీఈవో రానున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లోగా ఆ వ్యక్తి సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి పేరును ప్రకటించలేదు. కాకపోతే సీఈవోగా వచ్చేది మహిళ అని సంకేతం ఇచ్చారు.
దీంతో ఆ మహిళ ఎవరు కావొచ్చని పలువురు ఇంటర్నెట్లో వెతకసాగారు. అందరి దృష్టి లిండా యాకరినోపైనే పడింది. ఈమెనే సీఈవోగా రాబోతున్నట్టు ఓ అంచనాకు వచ్చారు. అయితే ఎవరీ లిండా యాకరినో అన్న విషయాన్ని పరిశీలిస్తే ఆమె ఎన్బీసీ యూనివర్సల్ సంస్థలో పనిచేస్తున్నట్టు వెల్లడైంది.