లక్నో : ముగ్గురు వ్యక్తులను ఏనుగుల గుంపు (Elephants) తరముతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల గుంపు వద్ద సదరు వ్యక్తులు సెల్పీలు తీసుకుంటుండగా అనూహ్యంగా జంతువులు వారిని వెంటాడటంతో ప్రాణభయంతో పరుగులు తీశారు.
దుధ్వ టైగర్ రిజర్వ్ నుంచి ఏనుగుల గుంపు వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు వాటితో సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల గుంపు అసహనానికి లోనై ఆ వ్యక్తులను వెంబడించింది. ఆపై ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో పరుగులు పెట్టడం వైరల్ క్లిప్లో కనిపించింది.
అటుగా వెళుతున్న వ్యక్తి ఈ ఘటనను రికార్డు చేసి క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంతువులను చికాకు పెట్టడం వంటివి చేయరాదని అటవీ శాఖ అధికారులు తరచూ సూచిస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతుండటంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
#UP के लखीमपुर खीरी जिले में #टस्कर हाथियों के झुंड के साथ सेल्फी लेना युवकों को को काफ़ी महंगा पड़ा 🙅 हाथियों के झुंड ने दौड़ाया,यूवको ने दौड़कर बमुश्किल हाथियों से बचाई अपनी जान 😢#वायरल_वीडियो पलिया तहसील के दुधवा टाइगर रिजर्व के पलिया गौरीफंटा मार्ग का है pic.twitter.com/P49c2v1lUo
— Dr.Ahtesham Siddiqui (@AhteshamFIN) July 4, 2023
Read More :