అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల(Family quarrels) కారణంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధూళిపాళ్లలో నివాసముంటున్న రమీమున్( 65), ఆమె కూతురు మౌలాబీ (36)ని ఖాసీం అనే వ్యక్తి రాడుతో కొట్టి చంపాడు.
వరుసకు కుమారుడయ్యే ఖాసీం ఈ దారుణానికి ఒడిగట్టాడని సత్తెనపల్లి పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాల కారణంగా ఖాసీం వారిపై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. కాగా నిందితుడు ఖాసీం పరారీలో ఉన్నాడని వివరించారు. బాధిత కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.