Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లపై భారత ఎన్నికల సంఘం ఆదివారం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఈసీ పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పార్టీ రూ.6,986.50కోట్లు అందుకున్నది. 2019-20 మధ్య కాషాయ పార్టీకి రూ.2,555 కోట్లు బాండ్లు అందాయని ఈసీ డేటా తెలిపింది. బీజేపీ పార్టీ తర్వాత అత్యధికంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీకి రూ.1,397కోట్ల విలువైన బాండ్లు అందాయి.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మొత్తం రూ.1,334.35 కోట్లను రీడీమ్ చేసింది. ఆ తర్వాత రూ.1,322కోట్లు బీఆర్ఎస్, రూ.944.50కోట్ల బీజేడీకి వచ్చాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మొత్తం రూ.656.50కోట్లు అందాయి. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచే రూ.509 కోట్లు డీఎంకే అందుకున్నది. అలాగే ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ రూ.4402.80కోట్లు, తెలుగుదేశం పార్టీ రూ.181.35కోట్లు వచ్చినట్లు ఈసీ డేటా పేర్కొంది.