న్యూఢిల్లీ: కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన నుంచి వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ను బలోపేతం చేసేందుకు అంకితం కానున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తన పాదయాత్రలో వీలైనంత మందిని కలవనున్నట్లు ఆయన చెప్పారు. బీహార్లో ఇప్పుడేమీ ఎన్నికలు లేవని, ఇక ఇప్పట్లో రాజకీయ పార్టీని స్థాపించే ప్రణాళిక ఏదీ లేదన్నారు. రాబోయే మూడు లేదా నాలుగేళ్లు ప్రజలకు చేరువయ్యే పనిలో నిమగ్నం కానున్నట్లు ఆయన తెలిపారు.