ECI : లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన మరుసటి రోజే కేంద్రం ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలతోపాటు, , ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీలను మార్చింది.
ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుతోపాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4న జరుగాల్సి ఉంది. జూన్ 6న ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియాల్సి ఉంది. అయితే అరుణాచల్ప్రదేశ్, సిక్కిం ప్రస్తుత అసెంబ్లీల కాల పరిమితి జూన్ 2తో ముగినుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్లో మార్పులు చేసింది.
లోక్సభ ఎన్నికల కౌంటింగ్తోపాటు జూన్ 4న కాకుండా ఆరుణాచల్, సిక్కిల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జూన్ 2న నిర్వహించనున్నట్లు తెలిపింది. అదేరోజు ఎన్నికల ప్రక్రియను కూడా ముగుస్తుందని పేర్కొంది. కాగా, ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.
లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అరుణాచల్ప్రదేశ్, సిక్కింలో తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్తోపాటే ఏప్రిల్ 19న.. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నాలుగో దశ ఎన్నికల పోలింగ్తోపాటు మే 13న.. ఒడిశాలో లోక్సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడో దశల పోలింగ్తోపాటు మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరుగనుంది.