న్యూఢిల్లీ, జూలై 11: ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఈవీఎంలతోపాటు ఏర్పాటుచేసే వీవీప్యాట్లలో కొత్త ఫీచర్ను ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నది. వీవీప్యాట్లో నమోదయ్యే పార్టీ గుర్తు, పేరు, అభ్యర్థి పేరు, వరుస సంఖ్య..ఇవన్నీ ఒక తెరపై లేదా టీవీ తెరపై ఆయా పార్టీల ప్రతినిధులు చూసుకునే విధంగా సరికొత్త ఫీచర్ రాబోతున్నదని కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
2019 నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన ఐదు పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్లను ఏర్పాటుచేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ లోడింగ్ యూనిట్ నుంచి వచ్చే స్లిప్లకు లెక్క సరిపోవాలి.