న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతు పవనాలపై ఎల్నినో ప్రభావం చూపనుంది. దీని కారణంగా మొదట ప్రకటించిన అంచనాలు తప్పనున్నాయి. తాజా అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 80.4 సెం.మీల వర్షపాతం నమోదు కానుందని ది వెదర్ కంపెనీ వెల్లడించింది.
ఎల్నినో ప్రభావం జూన్లో వచ్చే నైరుతి పవనాలపై పూర్తి సీజనంతా ఉండనుందని ఆ సంస్థ తెలిపింది. ఉష్ణ మండల పవనాలు భారత్లో వీచడం వల్ల జూన్ ప్రథమార్థంలో వర్షాలు తక్కువగా కురిసే సూచనలున్నాయి.