న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని ‘రావణ్’గా చూపుతూ ఫొటోలు విడుదల చేసిన బీజేపీపై కాంగ్రెస్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాలవీయను నిందితులుగా పేర్కొంటూ రాజస్థాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జశ్వంత్ గుర్జార్ జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. ‘ఓ మతానికి వ్యతిరేకిగా రాహుల్గాంధీని బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చూపారు.’ అని పిటిషన్లో ఆరోపించారు.