భువనేశ్వర్: పులి చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని బఫ్లా, సగద గ్రామాల్లో కొందరు పులిచర్మాలను కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఇంటర్ స్టేట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకు చెందిన పోలీసులు ఆ రెండు గ్రామాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 8 చిరుతపులి చర్మాలు, ఒక రాయల్బెంగాల్ టైగర్ చర్మం లభ్యమయ్యాయి.
దాంతో పులి చర్మాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కలహండికి చెందిన ఏసీఎఫ్ శివప్రసాద్ రథ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.