Eggs | లక్నో, జూలై 14: ఉత్తరప్రదేశ్లోని ల క్నోలో రూ.5 లక్షల విలువైన గుడ్లను చో రీ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీకి చెందిన మోతీలాల్, అతని భాగస్వామి మున్నాలాల్ జూన్ 19న హర్యానా నుంచి గుడ్లు తీసుకొని ఓ వాహనంలో వస్తున్నారు. ఎస్యూవీలో వచ్చిన కొందరు వారిని అడ్డుకున్నారు. ఇద్దరిని కొట్టి గుడ్లున్న లారీతో పాటు అక్కడి నుంచి ఉడాయించారు.