పాట్నా: బీహార్లో జూలై ఆరవ తేదీ తర్వాత విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రుల అనుమతి అవసరం ఉంటుంది. రోజు విడిచి రోజు వారిగా క్లాసులను నిర్వహించనున్నారు. దశలవారీగా విద్యాసంస్థలను తెరవనున్నారు. ఒకవేళ కోవిడ్ ఇలాగే నియంత్రణలోకి వస్తే, అప్పుడు జూలై ఆరవ తేదీ నుంచి దశలవారీగా విద్యాసంస్థలను తెరవనున్నట్లు ఆ రాష్ట్ర విద్యశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరీ తెలిపారు.
తొలి దశలో అన్ని వర్సిటీలు, కాలేజీలను ఓపెన్ చేస్తారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో 50 శాతం మంది విద్యార్థులకు అనుమతి ఇస్తారు. ఇక రెండవ దశలో సీనియర్ సెకండరీ, సెకండరీ స్కూళ్లను ఓపెన్ చేస్తారు. మూడవ దశలో ఒకటో తగరతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు ఓపెన్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోచింగ్ కేంద్రాలను కూడా ఓపెన్ చేసేందుకు అనుమతి కల్పించారు.