న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సీజ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాన్ని తెరువకూడదని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్తో పాటు 12 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హెరాల్డ్ హౌస్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్పేపర్ పబ్లిషర్ అయిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్.
ఇదిలా ఉండగా.. మనీలాండింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలను ఈడీ ఇప్పటికే విచారించింది. ఈడీ చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయడానికి ఈడీ కేంద్రం చేతిలో ఓ సాధనంగా మారిందని ఆరోపించింది. లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి సైతం పార్లమెంట్లోనూ ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అంశంపై చర్చను లేవనెత్తడానికి అవకాశం ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు.