ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, మాజీ మంత్రి జయంత్ పాటిల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీసింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఇందులో భాగంగానే జయంత్ పాటిల్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సూచించింది.