న్యూఢిల్లీ : ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ మనీ ల్యాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. డిసెంబరు 22న, 27న తమ ఢిల్లీ కార్యాలయానికి రావాలని కోరింది. లాలుకు ఈడీ సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ కేసులో కీలక నిందితుడైన అమిత్ కత్యాల్ను ఈడీ ప్రశ్నించిన తర్వాతే ఈ సమన్లు ఇవ్వడం గమనార్హం.