కోల్కతా: ప్రాథమిక పాఠశాలల నియామకాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో జూన్ 15న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీచేసింది. ఈడీ అధికారుల బృందం బుధవారం సాయంత్రం దక్షిణ కోల్కతాలోని బెనర్జీ నివాసానికి వెళ్లింది. అ సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో ఈడీ అధికారులు ఆ సమన్లను ఆయన సిబ్బందికి అందజేశారు.
మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని సాల్ట్ లేక్లోని సీఈవో కాంప్లెక్స్లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు వారు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల నియామకాల్లో కుంభకోణంపై 2022 నుంచి ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి పార్థా చటర్జీతో సహా పలువురు కీలక నేతలను ఈడీ అరెస్ట్ చేసింది.