రాయ్పూర్, అక్టోబర్ 11: ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు జరిగాయి.
రాయ్పూర్, రాయ్గఢ్, మహసముంద్, కోర్బా తదితర జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు సీఎం భూపేశ్ బఘేల్ స్పందిస్తూ.. ‘మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని బీజేపీ దొంగదెబ్బ కొట్టాలనుకుంటున్నది. బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నది’ అని విమర్శించారు.