న్యూఢిల్లీ: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 12 ప్రదేశాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. కన్నూరులోని విజయన్ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది. కొచ్చిన మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సంస్థ విజయన్ కుమార్తె టీ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీకి సుమారు 1.72 కోట్ల అక్రమ పేమెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి 2019 మధ్య ఆ లావాదేవీలు జరిగాయి.
ఎక్సాలాజిక్ సంస్థ ఎటువంటి సేవలు అందించకున్నా.. ఆ సంస్థకు డబ్బులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విజయన్ కుమార్తె వీణను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. వీణ భర్త ఎమ్మెల్యే మొహమ్మద్ రియాస్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్త కుమారుడు శరణ్ కర్త ఇంట్లో కూడా ఈడీ తనిఖీ చేస్తున్నది. ఈడీ సోదాలు అడ్డుకోవాలని సీఎంఆర్ఎల్ సంస్థ కోర్టను ఆశ్రయించింది. అయితే ఆ పిటీషన్ను మంగళవారం కేరళ హైకోర్టు డిస్మిస్ చేసింది. పీఎంఎల్ఏ కేసును ఈడీ నమోదు చేసింది.