ముంబై, మే 22: ఓ మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ను ఈడీ సోమవారం 9 గంటలకు పైగా ప్రశ్నించింది. అంతకుముందు పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తాను ప్రతిపక్షంలో ఉన్నందునే ఇ లాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. నిజం వైపు నిలబడిన వారిపై కేంద్ర దర్యా ప్తు సంస్థల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నదని శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. జయంత్ పాటిల్కు ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు ముంబైలోని ఈడీ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపట్టారు.