న్యూఢిల్లీ, జనవరి 27: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 29 లేదా 31న ఏ రోజు అందుబాటులో ఉండగలరో తెలపాలని ఈడీ కోరింది. భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు లావాదేవీలు జరిగాయంటూ ఈ కేసులో ఈడీ ఆరోపిస్తున్నది.
మొదటిసారిగా జనవరి 20న సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ ఏడు గంటలకుపైగా ప్రశ్నించింది. దర్యాప్తులో మరిన్ని ప్రశ్నలు ఆయన్ని అడగాల్సి ఉందని, వాటిని రికార్డు చేయాల్సి ఉంటుందని ఈడీ తెలిపింది.