కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసింది.
బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో జ్ఞానవంత్ సింగ్ (ఏడీజీ, సీఐడీ), కోటేశ్వరరావు, ఎస్ సెల్వమురుగన్, శ్యామ్సింగ్, రాజీవ్ మిశ్రా, సుఖేశ్ కుమార్ జైన్, తతాగత బసు ఉన్నారు. తాజాగా నోటీసులు అందుకున్న 8 మంది అధికారుల్లో ఏడుగురికి ఈడీ గత ఏడాది కూడా నోటీసులు జారీచేసింది.