కోల్కతా, సెప్టెంబర్ 12: విపక్ష నేతలకు, వారి కుటుంబ సభ్యులకు ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎడాపెడా ఇస్తున్న నోటీసుల్లో తప్పులు దొర్లి సమస్యలు తలెత్తుతున్నాయి. తృణమూల్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మరదలు మనేకా గంభీర్కు బొగ్గుగనుల కేసులో ఈడీ తన ముందు హాజరు కావాలని నోటీసు పంపింది. అయితే అందులో వేసిన సమయం 12.30 ఏఎం. అంటే అర్ధరాత్రి పన్నెండున్నరకు హాజరు కమ్మనే కదా అర్థం. ఆ మేరకు ఆమె లాయరును వెంటపెట్టుకుని అక్కడికి వెళ్తే ఆఫీసుకు తాళం ఉంది. దాంతో ఆమె నోటీసు పట్టుకుని ఆ మూసిన ఆఫీసు ముందు నిల్చుని ఫొటో దిగి వెనుకకు వచ్చారు. ఈ వార్త నెట్లో వైరల్ అయింది. కొన్ని చానెళ్లలో కూడా వచ్చింది. ‘పీఎం బదులు ఏఎం అని పడిందంటూ’ ఈడీ నాలిక కరుచుకుంది. టైపింగ్లో జరిగిన పొరపాటు అని వివరణ ఇచ్చుకున్నది. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు రావాలని మరో నోటీసు పంపింది.