న్యూఢిల్లీ, మార్చి 4: పవర్ బ్యాంక్ యాప్ పేరుతో మనీలాండరింగ్కు పాల్పడుతున్న సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. 14 చోట్ల జరిపిన దాడుల్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది. ఎగుమతులు, దిగుమతుల విలువను అధికంగా లెక్కగట్టడం, బోగస్ దిగుమతుల ద్వారా నిధులను విదేశాలకు తరలించడం వంటి అక్రమాలను ఈడి గుర్తించింది.
సాగర్ డైమండ్ లిమిటెడ్, దాని డైరెక్టర్ వైభవ్ దీపక్ షాకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు తెలిపింది. చైనాకు చెందిన కొందరు భారత్లో కొందరితో జతకట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిపింది.