తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీల్యాండరింగ్ కేసు(Money Laundering Case)ను నమోదు చేసింది. వీణాకు చెందిన ఐటీ కంపెనీ మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా చెల్లింపులు చేసినట్లు వీణాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. సీఎం విజయన్ కూతురు వీనకు ఎక్సాలాజిక్ అనే కంపెనీ ఉన్నది. దాంతో పాటు కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆదాయపన్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.