న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా వద్రా భర్త రాబర్ట్ వద్రా(Robert Vadra)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2008లో గురుగ్రామ్లోని శికోపుర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. వద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని కేవలం 7.5 కోట్లకు ఖరీదు చేసింది. అయితే ఆ భూమిని తర్వాత డీఎల్ఎఫ్ కంపెనీకి సుమారు 58 కోట్లకు అమ్మేసింది. ఎటువంటి డెవలప్మెంట్ చేపట్టకుండానే ఎక్కువ ధరకు ఆ భూమిని అమ్మేశారు.
అయితే అక్రమ రీతిలో రాబర్ట్ వరద్రా సుమారు 50 కోట్లు లాభం పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో 18 గంటల పాటు రాబర్ట్ వద్రాను ఈడీ విచారించింది. హర్యానాలో హూడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ల్యాండ్ డీల్ జరిగింది. అక్రమ అమ్మకంలో ఇతర రాజకీయ నేతలు కూడా ఉన్నారు.
2012లో అశోక్ ఖేమ్కా అనే ఆఫీసర్ ఆ ల్యాండ్ ముటేషన్ను రద్దు చేయడంతో ఈ కేసు బయటకువచ్చింది.