పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్(Land-For-Jobs) కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతురు మిసా భారతిపై ఈడీ ఇవాళ చార్జిషీట్ దాఖలు చేసింది. రైల్వేస్కు చెందిన వెస్ట్ సెంట్రల్ జోన్లోని జబల్పుర్లో జరిగిన గ్రూప్ డీ అపాయింట్మెంట్ల కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకున్నది. 2004 నుంచి 2009 రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఆ సమయంలో జరిగిన భూ అప్పగింతలకు చెందిన కేసులో విచారణ జరుగుతున్నది. ఉద్యోగాల కోసం కొందరు అభ్యర్థలు తమ వద్ద ఉన్న భూమిని లాలూ ప్రసాద్ కుటుంబసభ్యులకు రాసి ఇచ్చినట్లు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు తేజస్వి యాదవ్లు కూడా నిందితులుగా ఉన్నారు.