న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరానికి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శారద మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరం భార్య నళినీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
శారద మనీ ల్యాండరింగ్ కేసులో నళినీ చిదంబరం, సీపీఎం మాజీ ఎమ్మెల్యే దేవేంద్రనాధ్ బిశ్వాస్, దేవబ్రత సర్కార్, అసోం మాజీ మంత్రి అంజన్ దత్తాకు చెందిన అనుభూతి ప్రింటర్స్, అండ్ పబ్లికేషన్స్ సహా పలువురు లబ్ధిదారుల నుంచి రూ. 6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ పేర్కొంది.
ఈ కేసులో రూ. 3.30 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 3 కోట్ల విలువైన స్ధిరాస్తులను మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.