న్యూఢిల్లీ, మార్చి 30: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా టీఎంసీ మాజీ ఎంపీ కన్వర్ దీప్ సింగ్కు చెందిన రూ.29 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది. ఇందులో హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్లలో కన్వర్ దీప్ సింగ్ కంపెనీ ఆల్కెమిస్ట్ గ్రూపునకు చెందిన బీచ్క్రాఫ్ట్ విమానం, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు ఉన్నాయని తెలిపింది. అధిక లాభాలతోపాటు ఫ్లాట్లు, విల్లాలు ఇస్తామన్న తప్పుడు హామీలతో కన్వర్ దీప్ సింగ్కు చెందిన కంపెనీ సాధారణ ప్రజల నుంచి రూ.1,800 కోట్ల మేర సొమ్ము వసూలు చేసిందన్న ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్నది.