న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు (Hemant Soren) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద స్టేట్మెంట్ రికార్డింగ్ ఇంకా పూర్తికాలేదని.. మరోసారి ప్రశ్నించాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జనవరి 27 నుంచి 31లోగా జోనల్ ఆఫీస్కు రావాలని అందులో పేర్కొంది. ఇదే కేసులో ఈ నెల 20న ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.
గత శనివారం రాచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. సుమారు 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. జార్ఖండ్లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా, రాంచీ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన రంజన్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీ చేసింది.