న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ట్రాలకు ఈసీ నోటిఫికేషన్లు ఇష్యూ చేసింది. ఆ నోటిఫికేషన్లలో ఎవరెవరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించారో పేర్కొంటూ జాబితాలను ప్రచురించింది. అయితే, రాష్ట్రానికి, రాష్ట్రానికి ఈ జాబితాల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్టుమెంట్ వారికి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉద్యోగులకు, పోస్టల్ డిపార్టుమెంట్ ఉద్యోగులకు, ట్రాఫిక్ డిపార్టుమెంట్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్, సివిల్ ఏవియేషన్ డిపార్టుమెంట్, యూపీ మెట్రోరైల్ కార్పొరేషన్, దూరదర్శన్, ఆలిండియా రేడియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది.
పంజాబ్లో ఫుడ్ సివిల్ సప్లయ్ అండ్ కన్జూమర్ అఫైర్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా రేడియో, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, రైల్వేస్, బీఎస్ఎన్ఎల్, పవర్, హెల్త్, ఫైర్ సర్వీసెస్, సివిల్ ఏవియేషన్, ఈసీ ఆథరైజేషన్ ఉన్న జర్నలిస్టులూ పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటువేయవచ్చు. మణిపూర్లో ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్, బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్ట్ అండ్ టెలిగ్రామ్, దూరదర్శన్, ఆలిండియా రేడియో, హెల్త్, ఏవియేషన్, ఫైర్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్, ఈసీ ఆథరైజ్డ్ జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవచ్చు.
గోవాలో హెల్త్కేర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ప్రిజన్స్, ఎక్సైజ్ డిపార్టుమెంట్, వాటర్ అథారిటీ, కదంబ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్, ట్రెజరీ సర్వీస్, ఫారెస్ట్, ఆలిండియా రేడియో, దూరదర్శన్, బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్టల్, ట్రాన్స్పోర్టు, ఈసీ ఆథరైజ్డ్ జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వేయవచ్చు. ఉత్తరాఖండ్లో ఎయిర్పోర్టు అథారిటీ, ఫుడ్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆలిండియా రేడియో, ఆలిండియా రేడియో, ఎలక్ట్రిసిటీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ట్రాన్స్పోర్టు, ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్, బీఎస్ఎన్ఎల్, ఈసీ ఆథరైజ్డ్ మీడియా పర్సన్స్, ఫైర్ సర్వీస్ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు.