న్యూఢిల్లీ, మార్చి 17: ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలతో పాటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ను జూన్ 4వ తేదీనే నిర్వహించనున్నట్టు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే, ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీకే ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ను జూన్ 2వ తేదీనే జరపనున్నట్టు ఈసీ ఆదివారం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మాత్రం ముందుగా ప్రకటించినట్టుగానే దేశమంతా జూన్ 4వ తేదీనే జరగనున్నట్టు తెలిపింది.