అసెంబ్లీలో ఓటువేసే విషయంపై ఎంపీలకు ఈసీ సూచన
న్యూఢిల్లీ, జూన్ 22: రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా ఓటు వేసే విషయంపై ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది.
పార్లమెంట్ హౌస్లో ఓటేసేందుకు ఎన్నికలు జరిగే జూలై 18వ తేదీన పలు కారణాల రీత్యా ఢిల్లీలో ఉండని వారు, రాష్ర్టాలు, యూటీల అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైనా ఓటేయవచ్చని తెలిపింది. ఈసీకి ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది. పోలింగ్ తేదీకి 10 రోజుల ముందే సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఓటువేసే అసెంబ్లీని ఈసీ ఆమోదించిన తర్వాత మార్పులు చేయడం కుదరదు.