Nicobar islands | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల (Nicobar islands) రీజియన్లో సోమవారం ఉదయం 5.07 గంటలకు భూమి కంపించింది (Earthquake). దీనితీవ్రత 5.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. నికోబార్ దీవుల్లోని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనిప్రభావంతో ఇండోనేషియాలో (Indonesia) కూడా భూకంపం వచ్చిందని తెలిపింది.
An earthquake of magnitude 5.0 occurred in the Nicobar islands region at around 5:07 am today: National Center for Seismology pic.twitter.com/kfiK3O7Xno
— ANI (@ANI) March 6, 2023
కాగా, ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. రెండుసార్లు 5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ వెల్లడించింది. భట్వారీ ప్రాంతంలోని సిరోర్ అడవిలో తొలుత 12.40 గంటలకు భూమి కంపించిందని, అనంతరం 12.45 గంటలకు, మూడోది 1.05 గంటలకు భూకంపం వచ్చిందని జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ దడ్ద్ర పత్వాల్ తెలిపారు.
అదేవిధంగా జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 6.57 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదయిందని, శ్రీనగర్కు 38 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది.