న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూమి కంపించింది (Earthquake). మంగళవారం తెల్లవారుజామున 3.51 గంటలకు అండమాన్ సముంద్రంలో (Andaman Sea) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని అధికారులు పేర్కొన్నారు.
అంతకుముందు చైనాలో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. వాయవ్య చైనాలోని గన్సు (Gansu), కింగ్హై (Qinghai) ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ధాటికి పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో 111 మంది మరణించారు. మరో 230 మందికిపైగా గాయపడ్డారు. తెల్లవారిన తర్వాత అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:4.2, Occurred on 19-12-2023, 03:51:01 IST, Lat: 7.51 & Long: 94.65, Depth: 10 Km ,Location: Andaman Sea, for more information Download the BhooKamp App https://t.co/QQzUuR3nVy @Indiametdept @ndmaindia @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @moesgoi pic.twitter.com/LzO8FAgJwA
— National Center for Seismology (@NCS_Earthquake) December 18, 2023