గ్యాంగ్టక్: సిక్కింలో (Sikkim) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం వేకువజామున 3.01 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదయిందని తెలిపింది. రావన్గ్లాకు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నది.
భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు భూ ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, అర్ధరాత్రిపూట భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.