ఉత్తరకాశీ: ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రూడూన్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. కాగా, అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు.
ఉత్తరకాశీలో గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడో సారి. ఈ నెల 3న అర్ధరాత్రివేల భూ ప్రకంపణలు వచ్చాయి. అయితే అప్పుడు భూకంప కేంద్రం నేపాల్ ఉన్నది. ఇక నవంబర్ 5న 3.2 తీవ్రతో భూమి కంపించింది. యమునా నది లోయ ప్రాంతాల్లో ప్రకంపణలు ఎక్కువగా వచ్చాయి.
Earthquake of Magnitude:3.1, Occurred on 16-11-2023, 02:02:10 IST, Lat: 31.04 & Long: 78.23, Depth: 5 Km ,Location:Uttarkashi, Uttarakhand,India for more information Download the BhooKamp App https://t.co/4gKy0dB5mq@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/zd5ejMftoU
— National Center for Seismology (@NCS_Earthquake) November 15, 2023