National
- Jan 28, 2021 , 10:58:00
VIDEOS
ఢిల్లీలో స్వల్ప భూకంపం.. 2.8 తీవ్రత

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 9.17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. రిక్టర్స్కేలుపై దాని తీవ్రత 2.8గా నమోదయ్యిందని తెలిపింది. భూకంప కేంద్ర ఢిల్లీకి వాయవ్యంలో ఉందని ఎన్సీఎస్ అధికారులు ప్రకటించారు. భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING