శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో (Kishtwar) మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.47 గంటలకు కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.5గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, కిష్ట్వార్లో గత రెండు రోజుల్లో ఇది మూడో భూకంపం.
శనివారం మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతో భూమి కంపించింది. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కూడా భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 3.2 గా నమోదైంది. వరుసగా మూడుసార్లు భూమి కంపించినా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:3.5, Occurred on 07-04-2024, 02:47:02 IST, Lat: 33.34 & Long: 76.66, Depth: 10 Km ,Region: Kishtwar, Jammu and Kashmir for more information Download the BhooKamp App https://t.co/uV19ec9Snz@KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/3yHYkKDq6x
— National Center for Seismology (@NCS_Earthquake) April 6, 2024