Earth | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హాలీవుడ్ సినిమా ‘కోర్’ చూశారా? తనచుట్టూ తాను తిరుగుతున్న భూమి ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారుతుంది. అది సినిమా. అయితే, నిజంగా భూమి తిరగడం ఆగిపోతే, ఏమౌతుందన్న దానిపై పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. భూమి తన అక్షం చుట్టూ (భూభ్రమణం) సెకన్కు 400 మీటర్ల వేగంతో తిరుగుతుందట.
ఒకవేళ, ఉన్నట్టుండి ఈ తిరగడం ఆగిపోతే, పెను విధ్వంసమే దాపురిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. భూభ్రమణం మీదనే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి తదితరాలు ఆధారపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. భూమి తిరగడం ఆగిపోతే గురుత్వాకర్షణ శక్తి మాయమైపోయి సముద్రాలు పొంగొచ్చని, భూకంపాలు రావొచ్చని, సునామీలు విరుచుకుపడవచ్చని వాళ్లు పేర్కొంటున్నారు. మనుషులు గాలిలో తేలియాడవచ్చని చెబుతున్నారు. అయస్కాంతశక్తి లేకపోవడంతో పక్షులు సరైన దిశామార్గంలో ఎగరలేవని చెబుతున్నారు.