భారత్, ఆస్ట్రేలియా సంబంధాల్లో రక్షణ, భద్రత ఈ రెండే కీలక అంశాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఖ్వాద్ విదేశాంగ మంత్రుల భేటీ నేపథ్యంలో ఎస్. జైశంకర్ శుక్రవారం ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ డట్టన్తో భేటీ అయ్యారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం. ఇక విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్, పౌర సంబంధాల మంత్రి అలెక్స్ హకే తో కూడా భేటీ అయ్యారు. ప్రవాస భారతీయుల విషయం, కరోనా మహమ్మారి, ప్రస్తుతం ఉన్న సవాళ్ల గురించి చర్చించుకున్నామని ఆస్ట్రేలియా మంత్రి అలెక్స్ హకే ట్వీట్ చేశారు.