అహ్మదాబాద్ : దేవభూమి ద్వారకాలో జిల్లాలో గత రెండు రోజుల్లో పోలీసులు రూ.313.25కోట్ల విలువైన హెరాయిన్, మెథాంఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ నుంచి సముద్ర జలాల ద్వారా గుజరాత్కు డ్రగ్స్ను తరలించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. బుధవారం బుధవారం జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న 47 ప్యాకెట్లలో 45 కిలోల హెరాయిన్ ఉందని, వాటి విలువ రూ.225 కోట్లు ఉంటుందని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం తెల్లవారుజామున, మహారాష్ట్రలోని థానే నివాసి సజ్జాద్ ఘోసిని ఖంభాలియా పట్టణంలోని గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు పక్కా సమాచారం అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అతని నుంచి రూ.88.25కోట్ల విలువైన హెరాయిన్, 19 ప్యాకెట్ల మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. సలీం కారా, అలీ కారా అనే ఇద్దరు సోదరుల నుంచి తాను డ్రగ్ను కొనుగోలు చేసినట్లు విచారణలో ఘోసి చెప్పాడని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఆ తర్వాత, జిల్లాలోని తీర ప్రాంత పట్టణం సలాయాలోని కారా సోదరుల ఇంటిపై బుధవారం పోలీసులు దాడి చేసి 47 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 47 ప్యాకెట్లలో 45 కిలోల హెరాయిన్ ఉన్నట్లు విచారణలో తేలిందని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.225 కోట్లు ఉంటుందని ద్వారక ఎస్పీ సునీల్ జోషి తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఇద్దరు సోదరులు పాక్ నుంచి సముద్ర మార్గంలో గుజరాత్కు తీసుకువచ్చారని విచారణలో తేలిందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.