ఫిరోజ్పూర్, డిసెంబర్ 26: పంజాబ్లో భారత్–పాక్ (Pakistan) సరిహద్దు సమీపంలోని ఫిరోజ్పూర్ సెక్టార్లో బీఎస్ఎఫ్ సిబ్బంది ఆదివారం 40 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ.200 కోట్లు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఈ హెరాయిన్ను పట్టుకొన్నారు.
మియాన్ వాలీ ఉత్తర్ ఔట్ పోస్టు సమీపంలో 101 బెటాలియన్కు 22 ప్యాకెట్లలో 34 కేజీల హెరాయిన్ దొరికింది. ఆదివారమే 116 బెటాలియన్ మహమ్మది వాలా ఔట్పోస్టు దగ్గర 6 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకొన్నది.